ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి అర్థాంతరంగా వచ్చిన ఉద్యోగులు, న్యాయవాదులు నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కోసం ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.ఈ ప్రక్రియలో భాగంగా అపార్ట్ మెంట్లు నిర్మించి ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికలోటుతో సతమతం అవుతున్నప్పటికీ రైతులకు రూ.24,000 కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. అలాగే రూ.4,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఈసారి ఫిర్యాదుల సంఖ్య సగానికి తగ్గిందని ఆయన తెలిపారు. రాష్ట్రం ముందుకు దూసుకెళ్లడానికి ప్రజలు, ఉద్యోగులే కీలకమనీ చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ