ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగేందుకు మన రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడని విమర్శించారు. భవిష్యత్ తరాలు జగన్ ను క్షమించవని ఆయన స్పష్టం చేశారు.
గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నానని తనపై కక్షగట్టారనిఆరోపించారు. తన గొంతు నొక్కి, బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరో కొన్న భూములకు సాక్షిలో తన పేరు రాసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు, పిచ్చిరాతలకు, బెదిరింపులకు భయపడేది లేదని పేర్కొన్నారు.