telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రూ. 67 వేల కోట్ల నష్టం.. రూ. 25 వేల కోట్లు అప్పులు: దేవినేని ఉమ

devineni uma disappointed on utsav arrangements

ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఆరు నెలల జగన్ పాలనలో రాష్ట్రానికి రూ. 67 వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఇదే సమయంలో రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చారని దుయ్యబట్టారు.

కక్ష, వివక్షలే వైసీపీ ప్రభుత్వ అజెండా అని విమర్శించారు. ఓ వైపు మద్య నిషేధం అంటూనే… మరోవైపు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. మహిళా రైతు పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని చెప్పారు. భావ వ్యక్తీకరణపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మంత్రులకు ఒక న్యాయం, సాధారణ పౌరులకు మరో న్యాయమా? అని నిలదీశారు.

Related posts