కరోనా కాటుకు అగ్రరాజ్యం అల్లాడుతోంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండడంతో అమెరికాలో మరణ మృదంగం మోగుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ నిమిషానికి ముగ్గురి చొప్పున ప్రాణాలను బలితీసుకుంటోంది. గత 24 గంట్లలో ఏకంగా 4,591 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల మధ్య సగటున గంటకు 107 మంది చనిపోయారు.
ప్రస్తుతం మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 35 వేలు దాటిపోయింది. ఎపిసెంటర్గా మారిన న్యూయార్క్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 16 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్టంగా ఏడు లక్షల కసులు నమోదయ్యాయి.
మోదీ సంస్కరణల వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్: లక్ష్మణ్