దేశీయంగా మైక్రోస్కోపీ తయారీ పెరగాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో 12వ ఆసియా పసిఫిక్ మైక్రోస్కోపీ సదస్సును గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియాను గుర్తించే శక్తి మైక్రోస్కోపిస్టులదేనన్నారు.
మైక్రోస్కోపీ సాంకేతికతతో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. మూఢనమ్మకాలతో భయాందోళనలకు గురయ్యే ప్రజల ఇబ్బందులకు మైక్రోస్కోప్ ఆవిష్కరణతో చెక్ పడిందని . వ్యాధి నిర్థారణకు అవసరమైన సునిశిత పరిశోధనలకు ఇవి ఎంతో దోహదపడుతాయని తెలిపారు.