telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ ఆర్కేబీచ్‌లో సాయి ప్రియ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..భ‌ర్త మొబైల్ చూస్తున్న టైమ్‌లో ప్రియుడుతో

*విశాఖ బీచ్‌లో మిస్సైన‌ సాయిప్రియ ఆచూకీ ల‌భ్యం
*సాయి ప్రియ నెల్లూరులో ల‌వ‌ర్‌తో ఉన్న‌ట్లు గుర్తించిన బంధువులు
*ప్రియుడు ర‌వితో సాయిప్రియ వెళ్ళిపోయిన‌ట్టు గుర్తింపు
*సముద్రంలో గ‌ల్లంతైన‌ట్టు భావించిన భ‌ర్త శ్రీనివాస్‌
*భ‌ర్త మొబైల్ చూస్తున్న టైమ్‌లో సాయి ప్రియ జంప్‌ ..

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో కనిపించకుండా పోయినా సాయి ప్రియ ఆచూకీ ల‌భ్యం అయ్యింది.దాదాపు 36 గంటలుగా సెర్చింగ్ ఆపరేషన్‌  చేపడుతోన్న అధికారులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది.

సాయి ప్రియ నెల్లూరులో ప్రియుడు ర‌వితో ఉన్న‌ట్లు బందువులు గుర్తించారు .భ‌ర్త మొబైల్ చూస్తున్న టైమ్‌లో సాయి ప్రియ ప్రియుడు ర‌వితో జంప్ అయిన‌ట్టు తెలుస్తోంది.

శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది.

ఇదే సమయంలో  మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది.

సముద్రం ఒడ్డున ఫొటోలు దిగుతోన్న సమయంలో తనకు ఏదో మెసేజ్‌ వచ్చిందని బయటకు వ‌చ్చిన టైంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

 

Related posts