telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టేసిన ఏపీ హైకోర్టు!

ap high court

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపి, తీర్పును వెలువరించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఇంద్రనీల్ వాదిస్తూ… ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పును వెలువరిస్తూ 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్నిఆదేశించింది.

Related posts