telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హిందూపురం అభివృద్దే .. లక్ష్యం.. : ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్

ycp mlc ikbal on hindupuram development

వైఎస్సా ర్‌ సీపీ ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ హిందూపురాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు అన్నారు. పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాలులో పట్టణంలోని 3, 8 వార్డులకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ… టిడిపి పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణం ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సినీనటుడు బాలకృష్ణను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన మాత్రం హిందూపురంను పూర్తిగా మరిచిపోయి కేవలం షూటింగ్లకే పరిమితమయ్యారన్నారు. ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, చిన్న పాటి వర్షానికే మురుగు కాలువలు నిండి ఇళ్లల్లోకి నీరు ప్రవహిస్తుందన్నారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోని హిందూపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.

త్వరలో జరుగబోవు మున్సిపల్ ఎన్నికల్లో విజయడంక మోగించే విధంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పని చేయాలన్నారు. గ్రూపు రాజకీయాలకు తావు ఇవ్వకుండా కలిసి కట్టుగా పనిచేస్తున్నప్పుడే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. తన పేరు చెప్పుకొని కొంతమంది వసూళ్లకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాను నీతి, నిజాయితీతో పనిచేస్తున్నానని, ప్రతి కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో వుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సమన్వయ కర్త చౌళూరు రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి జనార్ధన రెడ్డి, మారుతి రెడ్డి, గోపి క్రిష్ణ ఫైరోజ్ అహ్మద్, సమీవుల్లా, అబ్దుల్లా విజయ బాస్కర్ రెడ్డి, రహమాన్ చాంద్ బాసా అల్తాఫ్, మాజీ కౌన్సిలర్లు ఆసీఫ్, జబీ, రోష న్ అలి, షానూర్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts