కరోనా వ్యాప్తి కారణంగా ఎంసెట్ కు హాజరుకాని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో పరీక్షను నిర్వహిస్తామని ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన అన్నారు.
ఎంసెట్ పరీక్ష రాయని విద్యార్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా [email protected] మెయిల్కి తమ హాల్ టికెట్తో పాటు, కరోనా రిపోర్టులను పంపాలని సూచించింది. వీరికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కాగా, దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే 0884-2340535, 2356255 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.రవీంద్ర తెలిపారు.