telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఎంసెట్ కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం!

exam hall entrence

కరోనా వ్యాప్తి కారణంగా ఎంసెట్ కు హాజరుకాని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో పరీక్షను నిర్వహిస్తామని ఏపీ ఎంసెట్‌ చైర్మన్ ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని ఆయన అన్నారు.

ఎంసెట్ పరీక్ష రాయని విద్యార్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా [email protected] మెయిల్‌కి తమ హాల్ టికెట్‌తో పాటు, కరోనా రిపోర్టులను పంపాలని సూచించింది. వీరికి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. కాగా, దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే 0884-2340535, 2356255 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర తెలిపారు.

Related posts