శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చెన్నై గొడుగులను వినియోగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారి సేవలో వినియోగించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమితి సభ్యులు గొడుగులను టీటీడీ అధికారులకు అందించారు.
నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను వినియోగంచనున్నారు. మొత్తం 11 గొడుగులను తీసుకురాగా, ఇందులో 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, మరో 2 గొడుగులను బుధవారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి సేవలో వినియోగిస్తారు.