తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులతో సినీ నటుడు అలీ వైసీపీలో చేరారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సోమవారం హైద్రాబాద్ లోటస్పాండ్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో అలీ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటుడు అలీపై బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వస్తానని తనతో అలీ చెప్పారని బుద్ధా పేర్కొన్నారు. కానీ కేసీఆర్ బెదిరింపులతో జగన్ వద్దకు వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు మరోసారి సీఎం కావాలని అలీ కోరుకున్నారని గుర్తు చేశారు. వైసీపీని కేసీపీగా జగన్ మార్చి వేశారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ప్రధాని మోదీ, కేసీఆర్ ల ఒత్తిడే కారణమని ఆరోపించారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి టీడీపీకి ఉన్న ఆయుధం ప్రజలేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చరిత్ర చంద్రబాబుదైతే… అవినీతి చరిత్ర జగన్ దని బుద్ధా పేర్కొన్నారు.
రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు: చంద్రబాబు