telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుంది : బండి

ఈ మధ్య బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి పెంచారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ కు పట్టిన వాస్తుదోషం అని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా… అయన చేసిన పాపాలు పోవు. అమరవీరుల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది. నాగార్జున సాగర్ లో బీజేపీని ఎదుర్కోవడం కోసం తెరాస కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ లో వచ్చిన ఫలితాలే నాగార్జున సాగర్ లో వస్తాయి. బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుంది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయలేదు. ఉద్యోగ,విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కేసీఆర్ తో యుద్ధం చేస్తుంది. నాగార్జున సాగర్ కు తెరాస చేసింది ఏమి లేదు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన….నాగార్జున సాగర్ ప్రజలు తిప్పికొడతారు నాగార్జున సాగర్ లో గెలువు బీజేపీ దే అని ధీమా వ్యక్తం చేసారు బండి సంజయ్. చూడాలి మరి ప్రజలు ఏ విధమైన ఠిస్ర్పు ఇస్తారు అనేది.

Related posts