మద్యాన్ని నిషేధించాలని బీజేపీ నేత డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షపై మక్తల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శలు గుప్పించారు. డీకే అరుణ ఇల్లు మద్యం బాటిళ్లతో ఓ మ్యూజియాన్ని తలపిస్తుందని అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 25 మద్యం షాపులు ఉన్నాయని అన్నారు. అలాంటి డీకే అరుణ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మద్య నిషేధాన్ని కోరుతూ ధర్నా నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘అరుణమ్మా నీకు ఇది తగునా’ అని ఆయనన్నారు. పుట్టినింట్లో నిజాలు నేర్చిన నీవు.. మెట్టినింట్లో అబద్ధాలు నేర్చావని దుయ్యబట్టారు.