టీడీపీ సీనియర్ నేత, నటుడు నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయస్మృతులను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా నిలిచిపోయారని అన్నారు. ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మనకు దూరమై ఏడాది గడిచినా… ఇంకా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోందని చెప్పారు. హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందామని ట్వీట్ చేశారు.