telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శిరోముండనాల ఘటనలు మానవత్వానికి సిగ్గు చేటు: చంద్రబాబు

chandrababu tdp ap

శిరోముండనాల ఘటనలు మానవత్వానికి సిగ్గు చేటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. శిరోముండనాల కేసులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సీఎం‌ అండతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

దళిత యువకుడు ఓం ప్రతాప్‌ (28) మృతి చెందిన ఘటనపై మరోసారి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కోరడం వల్లే ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష చేశారని ఆయన చెప్పారు.

మృతుడి సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులే తీసుకున్నారని, ఈ కేసులో ఎలాంటి అవకతవకలు లేకపోతే ఈ పని ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. ఓం ప్రతాప్‌ ఫోన్‌కాల్‌ జాబితాను పోలీసులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

బెదిరింపులతో జరిగిన నేరాన్ని దాచాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్తూరులో దళితులపై దాడులకు పెద్దిరెడ్డే కారణమని చంద్రబాబు ఆరోపించారు.

Related posts