కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశమంతా సీఎం వైఎస్ జగన్ పథకాలను ప్రశంసించి అనుకరిస్తుంటే చంద్రబాబు మాత్రం రోజూ జగనే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు తీరు మారకపోతే రాజకీయంగా కనుమరుగుకావడం తథ్యమని జోస్యం చెప్పారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ ఆసుపత్రి లో 10 మంది మృతి చెందడానికి కారణమైన రమేశ్ ఆసుపత్రి యాజమాన్యంపై చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదు?’ అని ఆయన ప్రశ్నించారు.
సీఎం జగన్ సంక్షేమ పథకాలను చూసి రాబోయే ఎన్నికల్లో తమకు డిపాజిట్లు దక్కవనే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పురాణాల్లో రాక్షసులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లు ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.