ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చిదంబరానికి సుప్రీం బెయిల్ ఇవ్వడం సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు. కోర్టు ముందు చిదంబరం తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేస్తారన్న నమ్మకం ఉందని రాహుల్ తెలిపారు.
చిదంబరాన్ని 106 రోజుల పాటు జైలులో ఉంచారని, ఇది ప్రతీకారంతో చేపట్టిన చర్య అని రాహుల్ విమర్శించారు. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం చిదంబరానికి బెయిల్ ఇచ్చింది. తీహార్ జైలు నుంచి ఈ రోజు చిదంబరం బయటకు రానున్నారు. రేపు ఆయన పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రజా ప్రభుత్వం పోయి.. ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చింది: యనమల