telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈవీఎంల సమస్యల పై సీఈసీకి ఫిర్యాదు: గులాం నబీ ఆజాద్

Congress Gulamnabhi ajad fire Bjp

ఢిల్లీలో విపక్ష నేతలు ఈ రోజు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఎన్డీయేతర పక్షాల నేతలు హాజరయ్యారు. అనంతరం వారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈవీఎంల సమస్యల పై ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ సీఈసీతో గంటన్నరపాటు సమావేశమైనట్టు చెప్పారు. ఈవీఎంలలో సమస్యలు ఉన్నాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతోందని ఫిర్యాదు చేశామని అన్నారు.

ఈవీఎం, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఓట్లు లెక్కించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ తాము చేసిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఈసీని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. తాము చెప్పిన విషయాలను సుమారు గంట సేపు ఈసీ అధికారులు విన్నారని అన్నారు. తాము చేసిన ఫిర్యాదుల విషయమై మాట్లాడేందుకు రేపు ఈసీ అధికారులు సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

Related posts