శంషాబాద్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ గొడును వెల్లడించారు. సీఎం కేసీఆర్ మా సమస్యలను పట్టించుకోవడంలేదని రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోలకు చెందిన కార్మికులు, జేఏసీ నేతలు స్వామితో మొరపెట్టుకున్నారు.
గత 26రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చినజీయర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను స్వామీజీ సావదానంగా విన్నారు. మరోవైపు సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన సకల జనభేరి సభకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు.