telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు

పాక్ వైఖరి ఏమిటో తేటతెల్లమైంది: గంభీర్

Gautam Gambhir bjp

పాకిస్తాన్ జట్టులోని ఏకైక హిందువు అయిన మాజీ క్రికెటర్ డానిష్ కనేరియాతో మిగితా ఆటగాళ్లు వ్యవహరించిన తీరును  పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తమ జట్టులోని ఆటగాళ్లు ప్రాంతాల వారీగా విడిపోయేవారని, కనేరియాను చాలా హీనంగా చూసేవారని పేర్కొన్నాడు. తమతో కలిసి భోజనం కూడా చేయనిచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి వ్యాఖ్యలపై స్పందించిన కనేరియా.. అక్తర్ చెప్పింది ముమ్మాటికీ నిజమని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో షోయబ్ వ్యాఖ్యలపై తాజాగా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించాడు. అక్తర్ మాటలను బట్టి పాకిస్థాన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి తేటతెల్లమైందన్నాడు. మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టుకు దాదాపు 90 టెస్టుల్లో సారథ్యం వహించాడని గుర్తు చేశాడు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా క్రికెటర్ అయినా దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నాడు. దాదాపు 60 మ్యాచుల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కనేరియాకు ఇలా జరగడం సిగ్గు చేటన్నాడు. మహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లకు భారత జట్టు ఎంతో గౌరవం ఇచ్చిందని గంభీర్ పేర్కొన్నాడు.

Related posts