telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టులో అచ్చెన్నకు ఊరట..బెయిల్ మంజూరు!

Atchannaidu tdp

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని కోర్టు షరతు విధించింది.

గత 70 రోజులుగా రిమాండ్ లో ఉన్న అచ్చెన్న ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, అచ్చెన్నకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related posts