telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు కరోనా బీమా!

apsrtc bus

ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్‌ బీమా వర్తింపచేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో ఇప్పటివరకు మరణించిన 36 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ బీమా వర్తింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మృతుల వివరాలతో సహా ధ్రువపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఏండీ కృష్ణబాబు జిల్లాల ఆర్‌ఎంలను ఆదేశించారు.

Related posts