అడవి శేష్ హీరోగా మేజర్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ తన బ్యానర్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మేజర్ షూటింగ్ పూర్తి చేసుకొని తరువాతి పనులపై దృష్టి పెట్టి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మహేష్ తన బ్యానర్పై మరో హీరోకు చాన్స్ ఇస్తున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరిని ఆకట్టుకున్న నవీన్ పోలిసెట్టి హీరోగా సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. ఏజెంట్గా అందరి ప్రశంసలు అందుకున్న నవీన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాను పూర్తిచేసుకున్న తరువాత మహేష్ బ్యానర్పై కనిపించేందకు సిద్దమవుతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించ అధికారిక ప్రకటనను విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. నవీన్ నటించే తీరు, అతడి శైలి నచ్చడంతో మహేష్ అతడిని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నవీన్ ‘జాతి రత్నాలు’ అనే సినిమాను చేస్తున్నాడు. అదేవిధంగా మహేష్ కూడా వచ్చే ఏడాది నుంచి సర్కారు వారి పాట షూటింగ్లో బిజీ కానున్నాడు. దాంతో నవీన్ సినిమాకు సంబంధించిన నిర్మాత బాధ్యతలను నమ్రతకు, దర్శకుడు వంశీ పైడిపల్లికి అప్పజెప్పనున్నాడు. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.
previous post
next post
కాజల్, అనుష్కలపై రెబల్ స్టార్ కామెంట్స్