మనిషికి వైవాహిక జీవితం ఎంత ముఖ్యమో… శారీరక శుభ్రత కూడా అంతే ముఖ్యం. శారీరకంగా పరిశుభ్రంగా ఉంటేనే మనుషులకూ, మనసులకూ దగ్గరవుతారు. శారీరకంగా పరిశుభ్రత పాటించకపోతే ఏం జరుగుతుందనే దానికి నిదర్శనంగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్ కు ఒక జంట ఏడాది క్రితమే పెళ్లి చేసుకుంది. ఇంతలోనే వారి పెళ్లి పెటాకులయ్యే పరిస్థితి వచ్చింది. తనకు విడాకులు కావాలంటూ భార్య భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకులు ఎందుకు కావాలని కోర్టు ఆమెను ప్రశ్నించగా, తన భర్త రోజుల తరబడి స్నానం చేయడం లేదని, గడ్డం తీయడం లేదని ఆమె తెలిపింది. తాను గట్టిగా నిలదీస్తే పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడని చెప్పింది. ఈ వాదనలు విన్న కోర్టు భార్యాభర్తలు ఇద్దరూ ఆరు నెలల పాటు విడివిడిగా ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాతే విడాకులు మంజూరు చేస్తామని తెలిపింది.
next post
కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడు: లక్ష్మణ్