telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

భారత్ లో 72 లక్షలు దాటిన కరోనా కేసులు

corona vaccine India

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసిన కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే దేశంలో 72 లక్షలు దాటింది కరోనా కేసుల సంఖ్య. కరోనా తో ఇప్పటివరకు 1,10,586 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటల్లో 63,509 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 730 మంది కరోనా తో మృతి చెందారు. తాజా కేసులతో దేశవ్యాప్తంగా 72,39,390 కి చేరాయి కరోనా కేసులు.

ఇక దేశంలో మొత్తం 1,10,586 మంది కరోనా తో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,26,876 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 63,01,928 మంది కరోనా ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.36 శాతంగా ఉండగా.. “యాక్టివ్” కేసులు12.10 శాతంగా ఉంది. మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.53 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది

Related posts