కరోనా కట్టడికి మాస్క్ లు ధరించని వారిపై ప్రభుత్వాలు పెద్దమొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాస్క్ లు ధరించడం తప్పనిసరైన పరిస్థితుల్లో ధనవంతులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం వినూత్న మార్గాన్ని అన్వేషించి పోటీ పడుతున్నారు.
వివాహాది శుభకార్యాలకు వచ్చే కొద్దిమందికి కూడా మాస్క్ లు తప్పనిసరి కావడంతో వెండి మాస్క్ లను తయారు చేయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి, చిక్కోడి తదితర ప్రాంతాల్లో వెండి మాస్క్ లకు డిమాండ్ అధికంగా ఉంది. వీటి ధర ఒక్కొక్కటీ రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకూ పలుకుతోందని తెలుస్తోంది.