టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం కొత్తగా ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఇందులో 70వేలకు పైగా పుస్తకాలను పుస్తక ప్రియుల కోసం అందిస్తున్నారు. ఎయిర్టెల్, నాన్ ఎయిర్టెల్ కస్టమర్లకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలపై ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ లభిస్తున్నది.ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ కస్టమర్ అయినా సరే ముందుగా 30 రోజులు ట్రయల్ పీరియడ్లో ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత నెలవారీ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
6 నెలలకు రూ.129 లేదా 12 నెలలకు రూ.199 చెల్లిస్తే ఎయిర్టెల్ ఇ-బుక్స్ యాప్లో ఉన్న పుస్తకాలను చదువుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ కస్టమర్లకు అయితే 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఇక ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావల్సిన బుక్స్ను కూడా కొనుగోలు చేయవచ్చు.