telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల పై జరుగుతున్న దాడులు హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాష్ట్రం లో అశాంతి ని సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు పొలిటీబ్యూరో సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు..ఇంకా రాష్ట్రం లో ఎలాంటి కుట్రలు చేయాలని అనుకుంటున్నారు ? అని అయన ప్రశ్నించారు. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్న ఆయన చంద్రబాబు దేవుళ్ళతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన తరువాత వివిధ వర్గాలు ,కులాలు మధ్య కొంతమంది విబేధాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు  అనే వ్యక్తి ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రజలు భావిస్తున్నారని, ఎన్టీఆర్ కంటే చంద్రబాబు గొప్ప నటుడని అన్నారు.  టీడీపీ నాయకులు పై కేసులు పెట్టవద్దు, అరెస్టులు చేయవద్దు అని చంద్రబాబు కోర్ట్ లో పిటిషన్ వేస్తారని అనుమానంగా ఉందని అన్నారు. తండ్రితీర్ధయాత్ర,కొడుకు శవయాత్రలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు లోకేష్ ను ఆటలో అరటిపండు లా భావిస్తున్నారని అన్నారు. రామతీర్థం సంఘటన పై కావాలంటే సిబిఐ విచారణను కోరుతామని ఆయన అన్నారు. చూడాలి మరి విచారణలో ఏం బయటపడుతుంది అనేది.

Related posts