telugu navyamedia
రాజకీయ వార్తలు

ఒ‌త్తిడిలో ప‌నిచేసేవాళ్ల‌కు యోగా ఉపయోగ‌ప‌డుతుంది: ప్రధాని మోదీ

pm modi on kargil day

ప్రజాసేవలో ఉండే అధికారులు అరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ఒ‌త్తిడిలో ప‌నిచేసేవాళ్ల‌కు యోగా, ప్రాణాయామం బాగా ఉపయోగ‌ప‌డతాయని తెలీపారు. 

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తయిన సందర్భంగా ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడుతూ కరోనా కట్టడిలో పోలీసులు ముందుండిసేవలందిస్తున్నారని అన్నారు.

కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు తమ పాత్రను చరిత్రలో లిఖించేలా సేవలందించారని చెప్పారు. సాధారణంగా ఐపీఎస్‌ ప్రొబేషనర్లను తాను ఇంటికి ఆహ్వానించేవాడినని, కరోనా కారణంగా కొత్త ఐపీఎస్‌లను ఈ సారి కలుసు కోలేకపోతున్నానని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న 131 మంది ఐపీఎస్‌ అధికారులను తాను త‌న ప‌ద‌వీ కాలంలో ఏదో ఒక‌సారి క‌చ్చితంగా క‌లుస్తాన‌న్నారు. ఆయన పేర్కొన్నారు.

Related posts