హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు అమిత్ షాతో సమావేశం కొనసాగింది.
చర్చలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ప్రధానంగా తీసుకొచ్చిన సీఎం జగన్.. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా సీఎం జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. భేటీ ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీ నుండి అమరావతికి బయలుదేరి వెళ్లారు.