telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్..

*హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్
*ఈనెల 28న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వెళ్లిన బాలిక
*ప‌బ్‌లో బాలిక‌ను ట్రాప్ చేసిన వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ కొడుకు
*నిర్మానుష‌ప్రాంతంలో 17 ఏళ్ళ బాలిక‌పై కారులో గ్యాంగ్ రేప్‌..
*ప‌బ్ నుంచి కారులో తీసుకెళ్లార‌ని బాలిక వెల్ల‌డి..
*వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బాలిక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..
*సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్‌ ఇన్సోమియా పబ్‌ నుంచి 17 ఏళ్ళ బాలికను ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి న‌లుగురు హ‌త్యాచారం చేశారు. ఈ ఘటన శ‌నివారం జ‌ర‌గ‌గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివ‌ర్లాలోకి వెళితే..

గత నెల 28న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (17) స్నేహితులతో క‌లిసి జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్‌ ఇన్సోమియా పబ్‌కు వెళ్లింది. 

అయితే ప‌బ్‌ నుండి సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వ‌స్తున్న స‌మ‌యం లో యువ‌తిని ఇంటికి డ్రాప్ చేస్తామంటూ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. అనంత‌రం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు బాధితురాలు కేకలు వేయడంతో యువకులు ఆమెను రాత్రి ఏడుగు గంటల సమయంలో తనను పబ్ వద్ద వదిలివెళ్లారు.

అనంతరం ఇంటికి వచ్చిన కుమార్తె మెడపై తల్లిదండ్రులు ఆరా తీయగా.. కొందరు యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై అసభ్య ప్రవర్తన కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక ప్రకారం బాలికపై అత్యాచారం జరిగినట్లు భరోసా కేంద్రం అధికారులు తేల్చారు.

అయితే కారులో తనపై న‌లుగురు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు  పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts