telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ..ఇద్దరికీ బెర్తులు ఖరారు!

cm jagan ycp

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.29 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. రేపు మధ్యాహ్నం సీఎం జగన్‌ రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు.

ఇప్పటివరకు మంత్రిగా ఉన్న మోపిదేవి, డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైనందున వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానాల్లో కొత్త మంత్రులను నియమించనున్నారు. వీరిస్థానంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది.

Related posts