telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి -ముఖ్యమంత్రి జగన్ భావోద్వేగ ట్వీట్

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగ ట్వీట్ చేశారు.

‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Related posts