telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుంది: యనమల

Yanamala tdp

ఏపీలో కరోనా మరణాలపై చేస్తోన్న ప్రకటనలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వస్తుంది, దానికదే పోతుందంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు.

కరోనాపై నిజాలు బయటకు రాకుండా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు కాబట్టే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పడం ఆత్మవంచనేనని అన్నారు. ఇలా చెబుతూ వారు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

కరోనా వైరస్‌ కట్టడిపై నిపుణులందరూ తలలుపట్టుకుంటున్నారని, జగన్‌ మాత్రం చాలా తేలికగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదైన 15 జిల్లాల్లో కర్నూలు కూడా ఉందని గుర్తు చేశారు. జగన్ నిర్లక్ష్య ధోరణి వల్లే అధికార యంత్రాంగం కూడా ఈ వైరస్‌ను చాలా తేలిగ్గా తీసుకుందన్నారు.

Related posts