telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి బుగ్గన

Mla buggana,data leake

టీడీపీ నేతల తీరుపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. నిన్న జరిగిన ఘటనపై టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్ ను కోరారు. ‘మార్షల్స్ వాళ్ల డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితులపై మార్షల్స్ వారి పని వాళ్ళు చేస్తారన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న జరిగిన ఘటనలో ప్రమేయమున్న శాసనసభ్యులు, ఇతరులపైన సముచితమైన చర్యలు తీసుకోవాలన్నారు.

టీడీపీ నేతలు చర్చిద్దామన్న విషయాలన్నింటిపై సభలో చర్చిస్తున్నామని అన్నారు. చంద్రబాబు పై మంత్రి విమర్శలు గుప్పించారు. నేను చండశాసనుడిని నేను తలుచుకున్నానంటే ఇది చేస్తా.. అది చేస్తాం.. పాతేస్తా.. తాటతీస్తా.. గుండెల్లో నిద్రపోతా.. అంతుచూస్తా అని చంద్రబాబు అంటున్నారని దుయ్యబట్టారు. గతంలో కూడా ఆయన అధికారుల గుండెల్లో నిద్రపోతా అని అన్నాడు.. పాపం ఇంట్లో సరిగ్గా పడుకోవట్లేదేమో ఎల్లప్పుడూ అధికారుల గుండెల్లోనే పడుకుంటున్నారని రోశయ్య అన్నారని బుగ్గన గుర్తు చేశారు.

Related posts