ఆంధ్రప్రదేశ్లో మరో శిరోముండనం ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం, విశాఖపట్నంలో నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనం ఘటనలు మరవకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తన బంధువుల దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని పార్టీ చేసుకుందామని పిలిచిన మరో యువకుడు అక్కడికి వెళ్లక శిరోముండనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
జంగారెడ్డిగూడెం పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అభిలాష్ విజయ్ సాయి అనే యువకుడి బంధువు అయిన మహిళ వద్ద మూడు నెలల క్రితం రూ. 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు తాలూకా డబ్బు తనకి ఇవ్వలాని విజయ్ మూడు రోజులుగా అభిలాష్ని అడుగుతున్నాడు. ఇదే విషయమై అక్టోబర్ 3వ తేదీన రాత్రి విజయ్బాబు, పార్టీ చేసుకుందామని చెప్పి అభిలాష్ను కారులో ఎక్కించుకుని మరో వ్యక్తితో అభిలాష్కు శిరోముండనం చేయించారు. అనంతరం బాధితుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇక అభిలాష్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు.
వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి