తిరుపతి స్విమ్స్ లోని పద్మావతి కోవిడ్ సెంటర్ లో నిన్న పొద్దుపోయాక ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రిలోని ఒక భవనం నాలుగో అంతస్తు మీద నుండి జారి పడిన దిమ్మెలు ఓ మహిళా ఉద్యోగి మీద పడగా తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు కోవిడ్ రోగులు కూడా తీవ్రంగా గాయాపడ్డారు. అయితే మృతి చెందిన మహిళ ఆరు నెలలు గర్భవతి కావడం అందరి కంటా కన్నీళ్లు తెప్పించింది. ఆమె కరోనా రోగులను ఆసుపత్రికి తీసుకు వచ్చి అలానే డిశ్చార్జ్ అయిన వారిని బయట విడిచే అటెండర్ గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆమె మృతిచెందడం విషాదంగా మారింది.. అలానే కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన బాధితులు మళ్ళీ గాయాలతో బెడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్లాబ్ కూడా భారీ శబ్దం చేస్తూ కూలడమే కాక రాధిక సహా మరో ఇద్దరి ఆర్తనాదాలతో మిగతా సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు. తీవ్ర గాయాలతో పడిఉన్న ఉన్న రాధికను అంబులెన్స్ లో స్విమ్స్ ఎమర్జన్సీకి తరలించినా అప్పటికే మరణించింది. విషయం తెలుసుకున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం కూడా పరిశీలించారు. గోడ కూలడానికి గల కారణలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు: బాబు మోహన్