ప్రముఖ సినీ నిర్మాత, నటి భాగ్యశ్రీ “మైనే ప్యార్ కియా” సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆమె కన్స్ట్రక్షన్ బిజినెస్మేన్ అయిన హిమాలయ దస్సానిని 1990లో వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు, అవంతిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభిమన్యు ఇప్పటికే ఓ సినిమాలో నటించారు. తాజాగా భర్త హిమాలయ దస్సానిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ముంబై అంబోలి పోలీసులు బెయిల్పై విడుదల చేశారు. ఇదే కేసులో మరో 15మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల్లో గ్యాంబ్లింగ్ రాకెట్పై పోలీసులు దాడులు జరిపారు. ఈ కేసులో హిమాలయ పేరు ప్రముఖంగా విన్పించడంతో హిమాలయను విచారించి అదుపులోకి తీసుకున్నారు.
previous post