పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం “జెర్సీ” శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో మంచి కలెక్షన్లతో థియేటర్లలో దూసుకెళ్తోంది. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్బస్టర్ టాక్తో తెచ్చుకున్న ఈ చిత్రంపై ఇప్పటికే విమర్శకులతో పాటు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ప్రత్యేకంగా నాని జెర్సీ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ “జెర్సీ” టీమ్పై ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా “జెర్సీ”ని ప్రశంసించారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. “హృదయాన్ని హత్తుకునే సినిమా. అద్భుతంగా రాసిన, తీసిన సినిమా “జెర్సీ”… వెల్డన్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా కోసం పనిచేసిన అందరూ గర్వపడతారు. నాని బాబు… జస్ట్ లవ్యూ అంతే” అని రాజమౌళి ట్వీట్ చేశారు.