telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సాయి ధ‌ర‌మ్ తేజ్‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్ బాబు…

mahesh-babu

కరోనా కారణంగా సినీ పరిశ్రమ నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ ఐరాస కారణంగా థియేటర్లు అని మూసుకుపోయాయి. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత మొదటిసారి ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. లాక్ డౌన్ త‌ర్వాత థియేట‌ర్‌లో విడుద‌లవుతున్న తొలి చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. తాజాగా సూప‌ర్ మ‌హేష్ బాబు, సాయిధ‌ర‌మ్ తేజ్‌తో పాటు యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానున్న ‘సోల్ బ్ర‌తుకే సో బెట‌ర్’ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ అంద‌జేస్తున్నాను అంటూ ట్వీట్స్ చేశారు. సాయిధ‌ర‌మ్, న‌భా న‌టేష్‌, సుబ్బుతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియ‌జేస్తున్నాను అని మ‌హేష్ తెలిపారు.  ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రంలో ‘వినూత్నమైన పాయింట్‌కు చక్కటి భావోద్వేగాలు, వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు సుబ్బు అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ట‌. చూడాలి మరి ఈ సినిమాకు అభిమానులు వస్తారా… లేదా అనేది.

Related posts