టిక్ టాక్ కు మన దేశంలో కూడా అనేక మంది బానిసలవుతున్నారు. ఈ సామాజికమాధ్యమంలో వస్తున్న వీడియోలు చూసి యువత చెడిపోతోందనే భావన రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, మన దేశంలో టిక్ టాక్ ను నిషేధించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.
లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, టిక్ టాక్ వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ యాప్ వల్ల యువత చెడు దారి పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూడా టిక్ టాక్ ను వినియోగించుకున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.