telugu navyamedia
సినిమా వార్తలు

బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా..ఈలోపే ప్రమాదం

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న. అయితే రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్‌ తెలిపారు. తన కుమారుడు నవీన్‌ విజయ కృష్ణకు సాయితేజ్‌ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నరేశ్‌ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.

Mega hero begins research on young IAS officers | TeluguBulletin.com

‘సాయిధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు. తను కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు నవీన్‌ విజయ కృష్ణ-సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా, కానీ ఆలోపే వెళ్లిపోయారని చెప్పాడు. పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఎటువంటి రిస్క్‌ తీసుకోకూడదని, బైక్‌ స్పీడ్‌పై వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నా ఈలోపే ప్రమాదం జరగడం బాధాకరం అ‍న్నాడు. వేగం విషయంలో యువత కంట్రోల్‌ ఉండాలని హితవు పలికాడు. ఆయనకి ఒకసారి చిన్న ప్రమాదం జరిగిందని, బాధతో అమ్మ ఒట్టు వేయించుకోవడంతో మళ్లీ బైక్‌ ముట్టుకోలేదని తెలిపాడు. మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో ఆనాటి నుంచి బైక్స్ జోలికి పోలేదు.

Happy Birthday Sai Dharam Tej: Tollywood Stars Wish The 'Supreme Hero' On His Special Day - Filmibeat

కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటి రెడ్డి అబ్బాయిలు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే కలుస్తాను’ అని నరేశ్‌ వివరించారు.

కాగా..ఎంతో మంది సినీ ప్రముఖులు సాయిధరమ్‌ తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. తేజ్‌ త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియాలో ఎందరో మెగా అభిమానులు కోరుకుంటూ కామెంట్‌ పెడుతున్నారు.

Related posts