telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడిపోయి ఇప్పటికీ బాధ పడుతున్నా… “ప్రేమపావురాలు” హీరోయిన్

bhagyasri

బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైనట్టు తెలిపింది. ‘మైనే ప్యార్‌ కియా’ వంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో అనువాదమై విడుదలైంది. ‘మైనే ప్యార్‌ కియా’తో కుర్రాళ్లకు కంటికిమీద కునుకు లేకుండా చేసిన భాగ్యశ్రీ, 1990లో వ్యాపారవేత్త హిమాలయా దస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘యువరత్న రాణా’ సినిమాలో నటించింది. భాగ్యశ్రీ తెలుగులో చేసిన ఏకైక చిత్రం ఇదే. ఇక భర్తే తన లోకమనుకుని సినిమా ప్రపంచంవైపు కన్నెత్తి కూడా చూడలేదామె. అయితే తాజాగా భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించడం విశేషం. తన పెళ్లి, విడిపోవడానికి దారి తీసిన పరిణామాల గురించి భాగ్యశ్రీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాకు తొలిసారిగా ప్రేమ పుట్టింది హిమాలయా పైనే. అతణ్ణే పెళ్లాడాను కూడా. కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు నా మనస్సు కుంగిపోయింది. అంటే నా జీవితంలో అతనికి ఇంక చోటు లేదా? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ఊహించుకుంటే చాలు.. ఇప్పటికీ భయంతో వెన్నులో వణుకుపుడుతోంది.. ఎందుకంటే, మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీకి కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు అభిమన్యు దస్సానీ గతేడాది ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ చిత్రంతో కథానాయకుడిగా హిందీ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు.

 

View this post on Instagram

 

#bhagyashree talks about her seperation with her husband Himalaya which was for few years. #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related posts