telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

39 మంది చిన్నారులకు సోనూసూద్ సాయం

Sonu-Sood

కరోనా కల్లోల సమయంలో దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేరు మారుమ్రోగిపోయింది. వలస కార్మికులకు ఆపన్నహస్తం అందించడంతో సహా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలతో పాటు ప్రముఖుల మన్నననలు అందుకున్నారు సోనూసూద్. తాజాగా కాలేయ మార్పిడి చికిత్స కోసం ఫిలిప్పీన్స్‌ నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన 39 మంది చిన్నారుల ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నటుడు సోనూసూద్‌ వెల్లడించారు. ఇచ్చిన మాటప్రకారం సోను ప్రత్యేక విమానం ఏర్పాటు చేసారు. ఈ విమానం శుక్రవారం మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన వీరంతా బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వీరికి ఢిల్లీలో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణ కారణంగా ప్రయాణం కుదరడం లేదని సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీంతో సోనూ స్పందించారు. వచ్చే రెండ్రోజుల్లో వీరిని ఢిల్లీకి తీసుకువస్తామని, వీరి విలువైన ప్రాణాలు కాపాడాల్సి ఉందని ట్వీట్‌ లో పేర్కొన్నారు.

Related posts