telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమం..ఐసీయూలో చికిత్స

Pranabh mukarji

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయనకు మెదడులో ఏర్పడిన కణితిని తొలగించేందుకు ఆపరేషన్ కూడా నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతమైనా 84 సంవత్సరాల వయసులో ఆయనకు ఇతర అవయవాల పనితీరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు.

 ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సర్వత్ర ఆందోళన నెలకొంది.ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 

Related posts