ఐపీఎల్ నుండి వైదొలిగిన బెంగుళూరు జట్టు సారధి కోహ్లీ మాట్లాడుతూ, ఐపీఎల్ సీజన్ లో తొలి సగభాగం తాము పూర్తిగా విఫలం అయ్యామని, రెండో అర్ధభాగంలో తమ జట్టు సూపర్ హిట్ అయిందని వ్యాఖ్యానించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించిన తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. చివరి 7 మ్యాచ్ లలో 5 విజయాలను నమోదు చేశామని గుర్తు చేసిన కోహ్లీ, తొలి 7 మ్యాచ్ లలోనూ ఇదే తరహా ఫలితాలను నమోదు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు.
ఈ సీజన్ లో తాము ఆర్సీబీ అభిమానులను అలరించలేకపోయామని, ఇదే సమయంలో ఓ మంచి విజయంతో సీజన్ కు ముగింపు పలికామని అన్నాడు. వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన తరువాత కోలుకోవడం చాలా కష్టమని, కానీ, తాము ప్లే ఆఫ్ కు దగ్గరగా వచ్చామని అన్నాడు. ఓటములు ఎదురవుతున్నా, తమ జట్టు యాజమాన్యం వెన్నంటి నిలిచిందని చెప్పుకొచ్చాడు. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం తమను ప్లే ఆఫ్ కు దూరం చేసిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
ఫస్ట్ నీ సినిమాల్లో నువ్వు ఎక్స్పోజింగ్ తగ్గించు… మంచు లక్ష్మిపై జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు