తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా మహేశ్ బాబు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరో కృష్ణతో సరదాకా సినిమా సెట్లో చురుకైన స్వభావంతో బాలనటుడుగా కెమరా ముందుకొచ్చిన మహేశ్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా హీరోస్థాయికెదిగారు… అగ్ర హీరోల సరసన సముచిత స్థానాన్ని కైవసం చేసుకోగలిగారు. అదే తరహాలో ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు.
నీడ సినిమాతో వెండితెరపైకొచ్చిన బాలనటుడు మహేశ్ బాబు… టాలీవుడ్ అగ్రహీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మసర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. తెలుగు చలనచిత్రపరిశ్రమలో నటుడిగా 42 యేళ్లు పూర్తి చేసుకున్నారు. 1979లో నీడ సినిమాలో బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన మహేష్ 42 సంవత్సరాలుగా సీనీరంగంలో కొనసాగుతున్నారు.
రాజకుమారుడు చిత్రంతో హీరోగా సినీ ప్రస్థానాన్ని మరో మలుపు తిప్పారు. జయాపజయాలతో సంబంధంలేకుండా స్టార్ హీరోగా తన ప్రతిభతో కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఎన్నోమలుపులు… మైలు రాళ్లను దాటొచ్చారు.
మహేశ్ అభిమానులు సామాజికమాధ్యమాల్లో 42 యేళ్ల స్వర్ణయుగం పేరుతో కామన్ డిస్ ప్లే పిక్చర్ ను వైరల్ చేయాలని సంకల్పించారు. 42 ఏళ్ల సినీకెరీర్ పూర్తయిన సందర్భంగా సీడీపీని లాంచ్ చేశారు. #42YearsForSSMBReignInTFI పేరుతో సీడీపీని అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ‘‘సర్కార్ వారి పాట’’ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. షూటింగా కార్యక్రమాలను పూర్తిచేసుకుని పోస్టుప్రొడక్షన్ పనుల్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. పరశురామ్ దర్శకత్వంతో తెరకెక్కించిన ఈసినిమా సంక్రాంతి కానుకగా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మరో విభిన్నకథాంశంతో తెలుగుసినీ ప్రపంచంలో సరికొత్త సినిమాతో సంచలన రికార్డులను సొంతంచేసుకోవాలనే యోచనలో ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ ప్రస్థానంలో సాధించిన విజయాలు, అద్భుతమైన డైలాగులను సామాజికమాధ్యమాల్లో వైరల్ చేయాలని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలుచేయబోతున్నారు.