బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. విభిన్న సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అమీర్ ఖాన్. షూటింగ్ నిమిత్తం కాకినాడకు విచ్చేశారు హీరో అమీర్ ఖాన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్ద’ షూటింగ్ నిమిత్తం అమీర్ ఖాన్ కాకినాడ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ చేరుకున్న అమీర్ ఖాన్ కాసరోవర్ హోటల్ లో బస చేశారు. ఇక ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ను చూసి… ఫొటోల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇక నేడు కోనసీమలోని అల్లవరం, ఓడలరేవు ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొననున్నారు అమీర్ ఖాన్.
ఈ సినిమా షూటింగ్ 15 రోజుల పాటు ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కొవిడ్ నేపథ్యంలో ఆయన్ని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఆయన బస చేసిన హోటల్కు ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు. కాగా ‘లాల్సింగ్ చద్దా’ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్ బాలాగా కనిపించగా ఆమిర్ ఖాన్.. లాల్ సింగ్ పాత్ర పోషిస్తున్నాడు. 105 కోట్ల బడ్జెతో నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆధారాలతో సహా కౌశల్ మీడియా సమావేశం