రేపు లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పొరుగుదేశాలయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన అణచివేతను తప్పించుకుని మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వాన్ని కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. రేపటి లోక్సభ కార్యకలాపాల జాబితా ప్రకారం హోం మంత్రి ఈ బిల్లును సోమవారం మధ్యాహ్నం ప్రవేశపెడతారని, అనంతరం దీనిపై చర్చించి ఆమోదం పొందుతారని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో అధికసంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే.
1985 నాటి అసోం ఒప్పందంలో పేర్కొన్న నియమ నిబంధనలను ఈ బిల్లు కాలరాస్తోందని వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ప్రాంత విద్యార్థి సంఘం (నెసో) ఈ నెల 10న 11 గంటల బంద్కు పిలుపునిచ్చింది.
ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…