గుజరాత్లోని సూరత్ జిల్లా సరోలి ప్రాంతంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనా స్ధలానికి 40 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఇటీవలే సూరత్లోని ఓ కోచింగ్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే.
లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు: రేవంత్రెడ్డి